నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 18 : చట్ట సభలోమహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకపోవడం దురదృష్టకరమని జనసేన మండల నాయకుడు ఎద్దుల నరసింహులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లు మహిళల గౌరవం, హక్కులు, సాధికారతకు సంబంధించిన కీలకమైనదని చెప్పారు. దీనిని అడ్డుకోవడం ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక ధోరణిని చూపిస్తోందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుని పట్టించుకోకుండా ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల ఆశలను నిర్లక్ష్యం చేశాయని అన్నారు. మహిళల హక్కుల కోసం జనసేన ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.మహిళలకు రాజకీయంలో ప్రాధాన్యత కల్పించాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేసేటువంటి మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం,వారు సంబరాలు చేసుకోవడం చూస్తుంటే ఆటవిక చర్య గుర్తొస్తుందని ఆయనవిమర్శించారు.దీనిని బట్టి చూస్తే ప్రతిపక్షాలకు మహిళలు రాజకీయాలకు రాణించడం ఇష్టం లేదని విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఆయన స్పష్టం చేశారు.ఏ రంగం లోనైనా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది దేశం పురోభివృద్ధికి సూచిక అనే విషయం ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదని ఆయన దుయ్యబట్టారు.
Reporter
Namitha News