Monday, 20 April 2026 04:19:26 PM
# జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసైనికుడు రాయల్ కుమార్ # జాతీయ స్థాయీ టెక్నికల్ సింపోసియం ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు # పోలీసులు చేసిన సేవ అభినందనీయం - యస్.ఐ. అనిల్ కుమార్ # అభివృద్ధి పనులతో కోసువారిపల్లి పరుగులు - బేరిపల్లి శ్రీనివాసులు # ముగిసిన క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కబడ్డీ పోటీలు -- విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీల ప్రదానం # యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు # యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు # అమ్మ చెరువు మిట్ట వద్ద రోడ్డు ప్రమాదం, తండ్రీ బిడ్డ మృతి # మిట్స్ లో ఘనంగా అన్యూవల్ డే # నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్దేశకులు # మహిళా బిల్లు ఆమోదం పొందలేకపోవడం దురదృష్టకరం # ఉపాధి హామీ పనుల వేగం పెంచండి - డ్వామా పిడి వెంకటరత్నం # ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అనిల్ చంద్ర పునేఠా # రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి –జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్

మహిళా బిల్లు ఆమోదం పొందలేకపోవడం దురదృష్టకరం

Date : 18 April 2026 08:46 PM Views : 30

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 18 : చట్ట సభలోమహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడం దురదృష్టకరమని జనసేన మండల నాయకుడు ఎద్దుల నరసింహులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లు మహిళల గౌరవం, హక్కులు, సాధికారతకు సంబంధించిన కీలకమైనదని చెప్పారు. దీనిని అడ్డుకోవడం ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక ధోరణిని చూపిస్తోందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుని పట్టించుకోకుండా ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల ఆశలను నిర్లక్ష్యం చేశాయని అన్నారు. మహిళల హక్కుల కోసం జనసేన ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.మహిళలకు రాజకీయంలో ప్రాధాన్యత కల్పించాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేసేటువంటి మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం,వారు సంబరాలు చేసుకోవడం చూస్తుంటే ఆటవిక చర్య గుర్తొస్తుందని ఆయనవిమర్శించారు.దీనిని బట్టి చూస్తే ప్రతిపక్షాలకు మహిళలు రాజకీయాలకు రాణించడం ఇష్టం లేదని విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఆయన స్పష్టం చేశారు.ఏ రంగం లోనైనా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది దేశం పురోభివృద్ధికి సూచిక అనే విషయం ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదని ఆయన దుయ్యబట్టారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :