Monday, 14 September 2026 09:51:24 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మహిళా బిల్లు ఆమోదం పొందలేకపోవడం దురదృష్టకరం

Date : 18 April 2026 08:46 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 18 : చట్ట సభలోమహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడం దురదృష్టకరమని జనసేన మండల నాయకుడు ఎద్దుల నరసింహులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లు మహిళల గౌరవం, హక్కులు, సాధికారతకు సంబంధించిన కీలకమైనదని చెప్పారు. దీనిని అడ్డుకోవడం ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక ధోరణిని చూపిస్తోందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుని పట్టించుకోకుండా ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల ఆశలను నిర్లక్ష్యం చేశాయని అన్నారు. మహిళల హక్కుల కోసం జనసేన ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.మహిళలకు రాజకీయంలో ప్రాధాన్యత కల్పించాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేసేటువంటి మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం,వారు సంబరాలు చేసుకోవడం చూస్తుంటే ఆటవిక చర్య గుర్తొస్తుందని ఆయనవిమర్శించారు.దీనిని బట్టి చూస్తే ప్రతిపక్షాలకు మహిళలు రాజకీయాలకు రాణించడం ఇష్టం లేదని విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఆయన స్పష్టం చేశారు.ఏ రంగం లోనైనా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది దేశం పురోభివృద్ధికి సూచిక అనే విషయం ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదని ఆయన దుయ్యబట్టారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :