నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 02 : తంబళ్లపల్లి మండలంలోని కోసువారిపల్లి పంచాయతీ నల్ల తిమ్మి రెడ్డి గారి పల్లె కు చెందిన అమరనాథ్ రెడ్డి ఒక నెల రోజులుగా కాలేయ వ్యాధితో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ రెండు రోజుల క్రితం స్వగ్రామం చేరారు. బుధవారం రాత్రి పరిస్థితి విషమించి అమరనాధరెడ్డి మృతి చెందాడు. లక్షలు ఖర్చు చేసిన ఫలితం లేక అమర్నాథ్ రెడ్డి మృతి చెందడం పై భార్యపద్మావతి, ఆరేళ్ల కుమారుడు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గురువారం అమరనాథరెడ్డి భౌతికకాయాన్ని టిడిపి నేతలు మల్లికార్జున నాయుడు, ఆదిరెడ్డి, తులసీదర్ నాయుడు, కృష్ణమూర్తి, కేశవరెడ్డి, శివరాంలు పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Reporter
Namitha News