నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 18 : ఉపాధి హామీ పనుల నిర్వహణలో వేగం పెంచాలని డ్వామా పీడీ వెంకటరత్నం సిబ్బందిని సూచించారు. శనివారం ఆయన మండలంలోని కోటకొండ, ఎగువ సుగాలి తాండ పంచాయతీలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ ఉపా ది కూలీలకు 125 రోజులు పని రోజులు పెంచామని వేతనాలు సకాలంలో చెల్లించడం జరుగుతుందని చెప్పారు. ఉపాధి పనులలో చెరువులు, కుంటలు, సాగునీటి వనరుల కాలువలు మరమ్మత్తు పనులు, నీటి సంరక్షణ పనుల కు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. మరుగున గ్రామాలలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించేలా అవగాహన పెంచాలన్నారు.వేసవి దృశ్య ఉపాధి కూలీలు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఆయన వెంట ఏపిడి చందన, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్ సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్లు ,ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
Reporter
Namitha News