నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 08 : తంబళ్లపల్లె మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ ఎం బాలకృష్ణ నాయక్ కు డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి లభించినట్లు చిత్తూరు జిల్లా నుండి ఉత్తర్వులు అందాయి. బాలకృష్ణ నాయక్ కు పదోన్నతి లభించడంపై ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవోలు పివి ప్రసాద్, మారుతీ కుమార్, టైపిస్ట్ సురేంద్ర, జూనియర్ అసిస్టెంట్ విజయ్, ఆఫీస్ సబార్డినేట్లు నాగరాజు, ఖయ్యూం లు ప్రత్యేకంగా అభినందించారు. గత నాలుగేళ్లుగా మండల పరిషత్ కార్యాలయంలో ఆయన చేసిన సేవలు కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. బాలకృష్ణ నాయక్ మండల పరిషత్ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు
Reporter
Namitha News