Wednesday, 29 July 2026 10:29:33 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

నేటి నుండి తంబళ్లపల్లెలో పారిశుద్ధ్య పనులు బంద్

Date : 01 June 2026 10:20 PM Views : 97

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 01 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లో నేటి నుండి పారిశుద్ధ్య పనులు నిలిపివేస్తున్నట్లు కార్మికులు అధికారులకు తెగేసి చెప్పారు. గత మూడు మాసాలుగా పరిమితికి మించి పారిశుద్ధ్య పనులు చేస్తున్నా కార్మికులకు నేడు రేపు అంటూ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు గతవారం జీతాలు చెల్లించాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో ముందస్తుగా జీతాలు చెల్లించకపోతే పనులు ఆపేస్తామని హెచ్చరించినా అధికారులు పెడచెవిన పెట్టారు. ఉదయం కార్మికులు ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ తో జీతాల విషయమై వేడుకోగా ఆయన జీతాల చెల్లింపుకు డిజిటల్ సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పడంతో వారు పస్తులతో పారిశుద్ధ్య పనులు చేయలేమని కరాకండిగా చెప్పి వెళ్లిపోయారు. పంచాయతీలో నిధులు ఉన్నా ఆరుగాలం కష్టపడే కార్మికుల జీతాలు చెల్లించకపోవడంపై స్థానిక ప్రజల సైతం అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వారికి జీతాలు చెల్లించకపోతే తంబళ్లపల్లె స్వచ్ఛ్ ఆంధ్ర దేవుడెరుగు కంపు కొట్టడం ఖాయం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :