నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 28 : మదనపల్లె లో ఆపరేషన్ వికటించి రైతు మృతి చెందిన విషాదకర సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. రొంపిచర్ల మండలం వారణాసి పల్లికి చెందిన రైతు శ్రీనివాసులు నాయుడు 51సం " వీపుపై గడ్డ రావడంతో ఆపరేషన్ చేయించు కోవడానికి మదనపల్లి కి వచ్చాడు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్ లో బుధవారం ఆపరేషన్ చేయించుకోగా ఆ ఆపరేషన్ వికటించడంతో రైతు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే మరో ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్ లో ఉంచారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు
Reporter
Namitha News