నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 01 : డిసెంబర్ 31 నుండి అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి నుండి పరిపాలన ప్రారంభమైంది. ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా మదనపల్లి కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లోని తన చాంబర్ కు వేద పండితులు వేదమంత్రాల ఉచ్చరణతో జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు. అనంతరం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా ఎస్పీ ధీరజ్, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 లో అన్నమయ్య జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. జిల్లా అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు
Admin
Namitha News