నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చేజర్ల - ఏప్రిల్ 30 : చేజర్ల మండలం నాగుల వెల్టూరు గ్రామ హైస్కూల్ నందు గ్రామానికి చెందిన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ ఏలూరు కేశవ చౌదరి విలేకరుల సమావేశం నిర్వహించారు.తమ ఊరి పాఠశాల విద్యార్థి కొర్రకూటి యశ్విత అనే పదవ తరగతి విద్యార్థినీకి జిల్లాలోని అత్యధికంగా 595 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం తనకెంతో గర్వకారణం గా ఉందని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు.కేశవ చౌదరి తెలిపారు. గ్రామ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 595 మార్కులు సాధించిన విద్యార్థిని కొర్రకూటి యశ్విత ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. తాను చదివిన ఈ పాఠశాల ఓదశలో విద్యార్థులు లేరని స్కూల్ తొలగించే పరిస్థితి వచ్చిందని అటువంటి పరిస్థితిలో ఈ పాఠశాలను దత్తత తీసుకొని చుట్టుపక్కల విద్యార్థులను తమ హైస్కూల్ కు వచ్చేలా తన సొంత నిధులతో వ్యాన్ ఏర్పాటుచేసి ఇక్కడికి విద్యార్థులు వచ్చి చదువుకునేలా చేసిన ప్రయత్నం ఫలించి అత్యధిక విద్యార్థులు సాధించి జిల్లా స్థాయికి ఈ స్కూలు చేరడంతో పాటు రాష్ట్రంతో పోటీపడే విధంగా అత్యధిక మార్కుల సాధించడం ఎంతో సంతోషంగా ఉందని పాఠశాలకు చెందిన మొత్తం 16 మంది విద్యార్థులు పాస్ కావడం అందులో 50 శాతం మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం మండల చరిత్రలోనే మా పాఠశాల ప్రథమం కావడం గర్వపడుతున్నామని ఈ సందర్భంగా వేలూరు. కేశవ చౌదరి తెలిపారు.. రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధి కోసం తాను మరింతగా శ్రమిస్తానని తెలిపారు.. పాఠశాల విద్యార్థిని యశ్విత మాట్లాడుతూ తమ పాఠశాల అధ్యాపకుల సహకారము తల్లిదండ్రుల తోడ్పాటుతో తాను ఈ మార్కులు సాధించానని వీరితోపాటు పాఠశాల అభివృద్ధి కోసం తోడ్పాటు అందించిన మా ఊరి పెద్దలు కేశవ చౌదరి గారికి పాఠశాల ఉపాధ్యాయులకు పాఠశాల కమిటీ సభ్యులకు విద్యార్థిని కొర్రకూటి యశ్విత ధన్యవాదాలు తెలిపారు.. ఈ సందర్భంగా కేశవ చౌదరిని మండల ఎంఈఓ పాఠశాల హెడ్మాస్టర్ ఘనంగా సత్కరించారు... ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు వేలూరు.రేవతిచౌదరి, మండల ఎంఈఓ మస్తానయ్య, పాఠశాల హెడ్మాస్టర్ సుబ్బయ్య, విద్యా కమిటీ చైర్మన్ మధుసూదన్ నాయుడు, ఉపాధ్యాయులు, సర్పంచ్ మస్తాన్, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు
Reporter
Namitha News