Sunday, 03 May 2026 09:13:35 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

పది ఫలితాల్లో జిల్లా ప్రధమ స్థానంలో కొర్రకూటి యస్విత

మా ఊరికే గర్వకారణం - సోమశిల డ్యామ్ చైర్మన్ వేలూరుకేశవ చౌదరి

Date : 30 April 2026 08:01 PM Views : 79

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చేజర్ల - ఏప్రిల్ 30 : చేజర్ల మండలం నాగుల వెల్టూరు గ్రామ హైస్కూల్ నందు గ్రామానికి చెందిన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ ఏలూరు కేశవ చౌదరి విలేకరుల సమావేశం నిర్వహించారు.తమ ఊరి పాఠశాల విద్యార్థి కొర్రకూటి యశ్విత అనే పదవ తరగతి విద్యార్థినీకి జిల్లాలోని అత్యధికంగా 595 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం తనకెంతో గర్వకారణం గా ఉందని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు.కేశవ చౌదరి తెలిపారు. గ్రామ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 595 మార్కులు సాధించిన విద్యార్థిని కొర్రకూటి యశ్విత ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. తాను చదివిన ఈ పాఠశాల ఓదశలో విద్యార్థులు లేరని స్కూల్ తొలగించే పరిస్థితి వచ్చిందని అటువంటి పరిస్థితిలో ఈ పాఠశాలను దత్తత తీసుకొని చుట్టుపక్కల విద్యార్థులను తమ హైస్కూల్ కు వచ్చేలా తన సొంత నిధులతో వ్యాన్ ఏర్పాటుచేసి ఇక్కడికి విద్యార్థులు వచ్చి చదువుకునేలా చేసిన ప్రయత్నం ఫలించి అత్యధిక విద్యార్థులు సాధించి జిల్లా స్థాయికి ఈ స్కూలు చేరడంతో పాటు రాష్ట్రంతో పోటీపడే విధంగా అత్యధిక మార్కుల సాధించడం ఎంతో సంతోషంగా ఉందని పాఠశాలకు చెందిన మొత్తం 16 మంది విద్యార్థులు పాస్ కావడం అందులో 50 శాతం మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం మండల చరిత్రలోనే మా పాఠశాల ప్రథమం కావడం గర్వపడుతున్నామని ఈ సందర్భంగా వేలూరు. కేశవ చౌదరి తెలిపారు.. రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధి కోసం తాను మరింతగా శ్రమిస్తానని తెలిపారు.. పాఠశాల విద్యార్థిని యశ్విత మాట్లాడుతూ తమ పాఠశాల అధ్యాపకుల సహకారము తల్లిదండ్రుల తోడ్పాటుతో తాను ఈ మార్కులు సాధించానని వీరితోపాటు పాఠశాల అభివృద్ధి కోసం తోడ్పాటు అందించిన మా ఊరి పెద్దలు కేశవ చౌదరి గారికి పాఠశాల ఉపాధ్యాయులకు పాఠశాల కమిటీ సభ్యులకు విద్యార్థిని కొర్రకూటి యశ్విత ధన్యవాదాలు తెలిపారు.. ఈ సందర్భంగా కేశవ చౌదరిని మండల ఎంఈఓ పాఠశాల హెడ్మాస్టర్ ఘనంగా సత్కరించారు... ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు వేలూరు.రేవతిచౌదరి, మండల ఎంఈఓ మస్తానయ్య, పాఠశాల హెడ్మాస్టర్ సుబ్బయ్య, విద్యా కమిటీ చైర్మన్ మధుసూదన్ నాయుడు, ఉపాధ్యాయులు, సర్పంచ్ మస్తాన్, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :