నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 17 : ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు పట్టణం లోని పి వి కే ఎన్ డిగ్రీ కాలేజి క్రీడా ప్రాంగణం లో రాష్ట్రస్థాయి అండర్ 17, 14 బాలికల సాఫ్ట్ బాల్ పోటీలలో అరికెల జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న యల్లారెడ్డి అండర్ 14 కు 9వ తరగతి చదువుతున్న దీపిక పాల్గొని,ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు సెలెక్ట్ అవ్వడం జరిగింది.పి డి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు పట్టణం లో గ్రౌండ్ లో జరిగిన అండర్ 17,14సాఫ్ట్ బాల్ పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరచి రాష్ట్ర స్థాయిపోటీలకు ఎంపికయ్యారని వీరులో ఒకరు వెస్ట్ గోదావరి జిల్లా లో అండర్ 17 పాల్గొంటారని అండర్ 14 రాష్ట్ర స్థాయి పోటీలు వై ఎస్ ఆర్ కడప జిల్లా పులివెందుల లో అండర్ 17రాష్ట్ర స్థాయిపోటీలు నవంబర్ 20-11-25 నుండి 22వరకు అండర్ 14వై ఎస్ ఆర్ కడప జిల్లాలో 22-11-25నుండి 24వరకు నిర్వహిస్తారన్నారు .ఈ సందర్భంగా అరికెల జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటాచలపతి రాజు వ్యాయామ ఉపాధ్యాయులు ఉదయ్ కుమార్, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.
Reporter
Namitha News