నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 12 : మల్లయ్య కొండ మహాశివునికి కళాకారుల మండలి సంఘ సభ్యుడు చిటికి శివరాంరెడ్డి కాశీ విశ్వనాధుని రుద్రాక్ష మాలను మల్లయ్య కొండ మహాశివునికి వితరణగా అందజేశారు. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినాన పదివేల మందికి రుద్రాక్ష మాలలు వితరణ చేయనున్నట్లు చెప్పారు. స్వామివారికి రుద్రాక్ష మాల వితరణ చేసిన శివరాంరెడ్డిని ఆలయ రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట, అర్చకులు మల్లికార్జున స్వామి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ఈశ్వర, సహదేవ, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
Reporter
Namitha News