నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఆగస్టు 17 : రామసముద్రం మండలం లోని దిన్నిపల్లె సమీపంలోని కొండఫై వెలిసిన గెవితిమ్మరాయ స్వామి ఆలయం లో ఆదివారం ఆలయ ప్రధాన అర్చకులు కులశేఖర్ బట్టర్ స్వామివారికి ఉదయం ఆలయ శుద్ధిచేసి పలు రకాల పుష్పములతో అలంకరణ చేసి అర్చనలు అభిషేకాలు నిర్వహించిన రెడ్డి వారి గౌనివారి కుటుంబ సభ్యులకు దర్శన బాగ్యం కల్పించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆర్.వి శ్రీనివాస్ గౌడ్ దంపతులకు ఆలయ అర్చకులు కులశేఖర్ ఆశీర్వదించి వేదమంత్రాలతో దీవించి స్వామివారిని దర్శనం కల్పించారు. స్వామిని దర్శించుకున్న ఆర్. వి సోమశేఖర్ గౌడ్, కిట్టే గౌడ్, భాస్కర్ గౌడ్, రాజశే ఖర్ గౌడ్, బాబు, మంజునాథ్ గౌడ్, భరత్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News