Sunday, 13 September 2026 07:10:39 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...!

Date : 13 April 2026 10:53 PM Views : 252

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం క్లైమాక్స్ కు చేరింది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా మార్గమైన హార్మూజ్ జలసంధిపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా బృందం మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస బెట్టి వార్నింగ్ లు ఇస్తున్నారు. హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తామని తాజాగా హెచ్చరించారు. అందుకు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా అమెరికాపై విరుచుకుపడుతోంది. అమెరికా అలా చేస్తే హార్మూజ్ సుడిగుండాల్లో ఆ దేశ సైన్యం కొట్టుకుపోతుందని వార్నింగ్ ఇచ్చింది. ఇక తాజాగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో.. అమెరికా నేవీ ఫోర్స్.. హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడం ప్రారంభించింది. ఇరాన్ నుంచి వచ్చి పోయే నౌకలను అమెరికా నేవీ అడ్డుకుంటోంది. సోమవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ ప్రక్రియను ప్రారంభించింది అమెరికా. ఇక ఇరాన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే హార్మూజ్ వద్ద భారత్ కు చెందిన దాదాపు 15 నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. ఈ నౌకల్లో అధికంగా ఎల్పీజీ, ముడి చమురు, ఎల్ఎన్జీ ఉంది. దాంతో భారత్ లో రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రిటైల్ ధరలను పెంచని నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఐఓసీ, హెపీసీఎల్, బీపీసీఎల్ లు పెట్రోల్ పై లీటర్ కు రూ. 24 అలాగే డీజిల్ పై లీటర్ కు రూ. 30 వరకు నష్టపోతున్నట్లు తెలుస్తోంది. ఇక ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎక్సైజ్ టాక్స్ ను లీటర్ కు రూ. 10 తగ్గించింది. అయితే భారత్ వద్ద ఇంకా దాదాపు రెండు నెలల వరకు సరిపడా నిల్వలు ఉన్నా .. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తే మన దేశానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఏప్రిల్ 14 నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.77 ఉండగా రేపటి నుంచి లీటర్ పెట్రోల్ ధర రూ. 102- 105 వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 103 నుంచి రూ. 112 కు పెరిగే ఛాన్స్ ఉందట. ఇక బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 102.92 నుంచి రూ. 110-113 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :