నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గత ఐదేళ్ళ గా విస్తృత సేవలు అందించిన యువ శక్తి ఫౌండేషన్ సేవలకు సుదీర్ఘ విరామం - ఇప్పటి వరకు సంపూర్ణ సహకారం అందించిన దాతలకు, సభ్యులకు కృతజ్ఞతలు - రాష్ట్ర వ్యాప్తంగా యువశక్తి ఫౌండేషన్ ద్వారా సేవలను అందించడం లో పాలు పంచుకున్న కుటుంబ సభ్యులకి రుణ పడి వుంటా - ఫౌండేషన్ అధ్యక్షులు కలిచెట్ల రెడ్డి గణేష్ మదనపల్లె : గత ఐదేళ్ళ గా విస్తృత సేవలు అందించిన యువ శక్తి ఫౌండేషన్ సేవలకు ఫౌండేషన్ అధ్యక్షులు కలిచెట్ల రెడ్డి గణేష్ సుదీర్ఘ విరామాన్ని ప్రకటించారు. ఈ గురువారం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ను ప్రజలకు చేరువ చేయడం లో ఇప్పటి వరకు సంపూర్ణ సహకారం అందించిన దాతలకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యువ శక్తి ఫౌండేషన్ ద్వారా సేవలను అందించడం లో పాలు పంచుకున్న సంస్థ కుటుంబ సభ్యులకి రుణ పడి వుంటా మని స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ఫౌండేషన్ ద్వారా యువత కి, ప్రజలకు, అవసర మైన వారికి సేవలు అందించాలంటే ఆర్టిక పరమైన సమస్యల వలన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయం చెప్పడానికి బాధగా వున్నా, ఆర్థిక ఇబ్బందులతోనే సేవలకు విరామం ప్రకటించడం జరిగిందన్నారు. ఇందుకు ఆర్థికంగా ఇప్పటి వరకు సహాయ సహకారాలు అబదించిన దాతలకు, ఫౌండేషన్ సభ్యులు గా బాధ్యత తో సేవలు అందించి, పేరు ప్రతిష్టలు పెంచి, గుర్తింపు ను తీసుకు రావడం లో చేసిన కృషి కి ధన్యవాదములు చెప్పారు.
Reporter
Namitha News