నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే! ఆయన అడుగుజాడల్లో మనమందరం పయనిద్దాం! డిఆర్ఓ సత్యనారాయణరావు! రాయచోటి: నమిత న్యూస్:ఏప్రిల్,11:- అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని, ఆయన అడుగుజాడల్లో మనమందరం పయనిద్దామని డిఆర్ఓ సత్యనారాయణరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక రాయచోటి కలెక్టరేట్లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా డిఆర్ఓ సత్యనారాయణరావు, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ సత్యనారాయణరావు మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు పూలే కుల వివక్షతపై ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఆయన పోరాటాల ఫలితంగానే బడుగు బలహీన వర్గాలకు హక్కులు రావడం జరిగిందన్నారు. అదేవిధంగా దేశంలో కుల వివక్షతను రూపుమాపడం జరిగిందని, మహిళలకు విద్యాపరంగా అనేక అవకాశాలు రావడం జరిగిందని అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సందప్ప మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మరియు మహిళా సాధికారత కోసం మహాత్మ జ్యోతి రావు పూలే ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం మనమందరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సందప్ప, ఆ శాఖ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే! ఆయన అడుగుజాడల్లో మనమందరం పయనిద్దాం! డిఆర్ఓ సత్యనారాయణరావు! రాయచోటి: నమిత న్యూస్:ఏప్రిల్,11:- అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని, ఆయన అడుగుజాడల్లో మనమందరం పయనిద్దామని డిఆర్ఓ సత్యనారాయణరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక రాయచోటి కలెక్టరేట్లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా డిఆర్ఓ సత్యనారాయణరావు, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ సత్యనారాయణరావు మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు పూలే కుల వివక్షతపై ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఆయన పోరాటాల ఫలితంగానే బడుగు బలహీన వర్గాలకు హక్కులు రావడం జరిగిందన్నారు. అదేవిధంగా దేశంలో కుల వివక్షతను రూపుమాపడం జరిగిందని, మహిళలకు విద్యాపరంగా అనేక అవకాశాలు రావడం జరిగిందని అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సందప్ప మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మరియు మహిళా సాధికారత కోసం మహాత్మ జ్యోతి రావు పూలే ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం మనమందరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సందప్ప, ఆ శాఖ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News