నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 07 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం పిచ్చి మొక్కలు పెరిగి అటవీ ప్రాంతాన్ని తలపిస్తూ అందులో పాములు సంచరిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన తాసిల్దార్ కార్యాలయం గత నాలుగు సంవత్సరాలుగా పైపెచ్చులూడి తరచూ ప్రమాదాలు జరిగేవి. ఈ సమస్యతో గత ఏడాది తాసిల్దార్ కార్యాలయాన్ని తాత్కాలికంగా పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కు మార్చారు. అయితే తాసిల్దార్ కార్యాలయం సుదూర ప్రాంతంలో ఉండడంతో అధికారులకు సౌకర్యవంతంగా ఉంది కానీ రైతులు, విద్యార్థులు, ప్రజలకు అందుబాటు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి నియోజకవర్గ కేంద్రమైన తంబళ్లపల్లెలో తహసిల్దార్ కార్యాలయం నిర్మాణానికి చొరవ చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Reporter
Namitha News