నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 12 : తంబళ్లపల్లె మండలంలోని ప్రజలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లాలనుకునే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఎస్సై అనిల్ కుమార్ ఆదేశాల మేరకు సిబ్బంది ఆటోలో మైక్ ద్వారా సంక్రాంతికి ఊర్లకు వెళితే సంబంధిత సమాచారం పక్కింటి వారితోపాటు పోలీసులకు ఇవ్వాలని విలువైన ఆభరణాలు, డబ్బు లాకర్లలో ఉంచుకోవాలని ఇంటి తాళాలు అక్కడే ఉంచకుండా వెంట తీసుకొని వెళ్లాలని పలు జాగ్రత్తలను విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రం తో పాటు మండలంలోని 21 పంచాయతీలలో ఆటోల ద్వారా పోలీసులు చేస్తున్న ప్రచారం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Reporter
Namitha News