Friday, 19 June 2026 05:08:44 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

అంగన్వాడి సమస్యల పరిష్కారానికి ఎంతవరకైనా సిద్ధం - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి హామీ

Date : 23 April 2026 11:20 PM Views : 392

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 23 : చాలీచాలని జీతాలతో జీవిస్తున్న అంగన్వాడి మహిళామతల్లుల సమస్యల పరిష్కారానికి అండగా నిలబడతానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అంగన్వాడీ మహిళలకు హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం అంగన్వాడి కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి స్వగృహం చేరుకుని తమ సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు తమకు కనీస వేతనం రూ 26 వేలు చెల్లించాలని, మే నెల వేసవి సెలవులు ప్రకటించాలని, హెల్పర్ల ప్రమోషన్ జీవో నెంబర్ 5 సవరించాలని, పెండింగ్ లోని మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్పు చేయాలని డిమాండ్లను ఎమ్మెల్యేకు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతా శిశు సంక్షేమంతో పాటు చిన్నారుల పాలిట తల్లులుగా ఆలనా పాలనా చూస్తున్న అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం సోచనీమన్నారు. అంగన్వాడీలకు పనిభారం పెంచి రకరకాల యాప్ ల ద్వారా వెట్టి చాకిరి చేయించుకుని వారి పనికి తగ్గ వేతనాలు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. పాఠశాలలతో పాటు అంగన్వాడీలకు సైతం వేసవి సెలవులు ఇవ్వాలని, 20 26 మార్చి బడ్జెట్ లో అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నేటి నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు జీతాలు పెంచి వారి పని భారం తగ్గించి వారి సమస్యలు పరిష్కరించాలని లేదంటే కూటమి ప్రభుత్వానికి అంగన్వాడి మహిళల శాపం తగిలి తీరుతుందని హెచ్చరించారు. మీ సమస్యల పరిష్కారానికి ఓ సోదరుడుగా అండగా నిలబడి పోరాటంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. అంగన్వాడీలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, పరుసతోపు సర్పంచ్ శ్రీనివాసులు, నరేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి, ఎంపీటీసీలు మహేష్, కరిముల్లా నాయకులు, వందలాది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :