Saturday, 13 June 2026 07:48:53 AM
# ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు # తంబళ్లపల్లెలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై ర్యాలీ # తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు # తంబళ్లపల్లెలో యోగాంద్ర విజయవంతం చేయండి - ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ # మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం # ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు - తృటిలో తప్పిన పెను ప్రమాదం # ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ # ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మిట్స్ విద్యార్థులు # మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు # మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం # తంబళ్లపల్లె లో 90వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలపరిశీలన # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్ # ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు # పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం # మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్ # ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన # రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్ # కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు

ముమ్మరంగా పశువైద్య సేవలు

Date : 10 June 2026 10:48 PM Views : 31

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 10 : పిచ్చి కుక్క వీరంగం సృష్టించి మూడు గ్రామాల ప్రజలు ముప్పు తిప్పలు పెట్టి గ్రామాలలోని 22 పశువులను గాయపరిచి సంచలనం సృష్టించి బెంబేలెత్తించిన సంఘటన కోసువారి పల్లి పంచాయతీలో వెలుగు చూసింది. పంచాయతీలోని దేవరబురుజు, సి కె దయ్యాలవారిపల్లి, మేకల వారి పల్లె గ్రామాలలో బుధవారం తెల్లవారుజామున ఓ పిచ్చి కుక్క వీరంగం సృష్టించి కనపడిన పశువులను విచక్షణ రహితంగా కరచి తీవ్రంగా గాయపరిచింది. తొలుత దేవరబురుజులో రెడ్డప్ప రెడ్డి కి చెందిన రెండు పశువులతో పాటు గ్రామంలో ఆరుబయట గల పలు పాడి ఆవులు, దూడలను గాయపరగా స్థానికులు తరిమికొట్టగా అదే ఊపులో పక్కనే గల సీ.కే దయ్యాలవారిపల్లి లో సైతం పలువురు రైతులకు చెందిన పాడియావులు దూడలను గాయపరిచి చివరిగా మేకల వారి పల్లెలో మరోసారి విజృంభించి పాడి పశువులను గాయపరిచింది. మొత్తంగా మూడు గ్రామాలలో 16 పాడి ఆవులు, ఆరు పాడి దూడలను గాయపరిచింది.విషయం తెలుసుకున్న గ్రామస్తులు మూకుమ్మడిగా పిచ్చి కుక్కను వెంటాడి చంపేశారు. పిచ్చికుక్క కాటుకు గురైన పశువుల రైతులు ఆందోళనతో లబోదిబోమంటూ పశువుల డాక్టర్ కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. మండల పశువైద్యాధికారి విక్రం రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పశు వైద్య సిబ్బందిని పై మూడు గ్రామాలకు పంపించి కుక్క కాటు పశువులకు ర్యాపిడ్ టీకాలను వేయడానికి పురమయించారు. పశు వైద్యాధికారి ఇందు, సిబ్బంది రమేష్, నాయక్ లు కుక్క కాటు బారిన పడిన పశువులకు ర్యాపిడ్ టీకాలు వేసి నెలరోజుల పాటు వర్షానికి తడవరాదని వైద్య సిబ్బంది సూచనలు, సలహాలు పాటించాలని రైతులకు సూచనలు ఇచ్చారు. కుక్క కాటు రైతులు లక్షలాది రూపాయల వ్యయంతో కొని వాటి పాల దిగుబడితో జీవనోపాధి సాగిస్తున్నామని పశువులకు ప్రాణాపాయం జరిగితే వాటినే నమ్ముకున్న మేము ఎలా బతకాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. పిచ్చికుక్క పశువులపై పడటం జరిగిందని అదే చిన్నారులు, మనుషులపై విజృంభిస్తే పరిస్థితి ఏంటని తలచుకొని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కల స్వైర విహారం పై దృష్టి సారించి కుక్క కాటు పశువుల రైతులను ఆదుకోవడానికి అండగా నిలవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :