Sunday, 03 May 2026 09:13:55 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

8 గంటల పని దినాన్ని కాపాడుకుందాం

ఘనంగా మే డే సంబరాలు

Date : 01 May 2026 11:18 AM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : . కొత్తకోట - మే 01 : నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలి అని అన్నమయ్య జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని అన్నారు *140 ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ను తంబళృపల్లి నియోజకవర్గం బి .కొత్తకోట లో దిగువ బస్టాండ్ నందు ఏఐటీయూసీ జెండాను ఎగరవేసి మేడేను కార్మికులతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి తంబళృపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బి వేణుగోపాల్ రెడ్డి ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కార్మికుల,పేదల పక్షాన నిలబడి వారి హక్కుల సాధనకై పాలకులను నిలదీసే బలమైన గొంతుక ఎర్ర జెండా అని "మేడే స్ఫూర్తితో కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ దిశగా జరుపుకోవాలని 1986లో అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పనివిధానంకోసం జరిగిన సమ్మె ఉద్యమంలో పాలకులు, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని ‘లాయల్టీ డే’గా వ్యవహరిస్తున్నారు. చాలా దేశాల్లో మే డే ని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు.ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటు చేసుకున్నాయి.1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్.ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. ఆపై ప్రపంచవ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు రామాంజనేయులు గఫూర్ కే బాలకృష్ణ మహమ్మద్ మాలిక్ సలీం శివశంకర్ చౌడప్ప సీనియర్ నాయకులు నరసింహులు బాబు లక్ష్మన్న పెద్ద రాయుడు శంకర బాబాజాన్ షఫీ సద్దాం జె గోపాల్ సాదిక్ బాలు కలందర్ ఖాదర్ వలీ ఆది భాష నర్సింహులు నసీబ్ భాష ఆటో సంఘం నాయకులు మరియు అన్ని కార్మిక సంఘాల నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :