నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం నవంబర్ 23 : రామసముద్రం మండల కేంద్రం లోని సత్యసాయి బాబా ఆశ్రమంలో ఆల్ ఇండియా ట్రస్ట్ బోర్డు సభ్యురాలు సావిత్రిదేవి శ్రీ హరన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగానిర్వహించారు. బాబా గారి శతజయంతి పురస్కరించుకుని బాబా చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.ఆల్ ఇండియా సత్యసాయి ట్రస్ట్ సభ్యురాలు సావిత్రి శ్రీహరన్ కు దిన్నిపల్లె గ్రామస్థులు డ్రప్పులు వాయిద్యాలతో గణస్వాగతం పలికారు ఆమెకు మహిళలు హారతులు పట్టి పుష్పాలు చళ్ళుతూ గ్రామంలో బానాసంచాలు కాలుస్తూ ఆమె చేతులు మీదుగా భారీ కేక్ కట్ చేసి స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించి జయంతి వేడుకల్లో పాల్గొన్నా భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యురాలు సావిత్రిదేవి శ్రీహరన్ మాట్లాడుతూ మండలంలో సాయిభాబా ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులు విద్యా బోధన తో పాటు వసతులు కల్పిస్తూన్నామని, వృద్ధులకు నెలకి, రెండు నెలలఒకసారి నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నామన్నారు.శ్రీ సత్య సాయి బాబా కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా అన్ని మతాలను సమానంగా చూసే దైవిక దృష్టికోణాన్ని బోధించిన మహనీయులని ఎవరిని బాధ పెట్టొద్దు అందరికీ సహాయం చేయండి అనే మానవతా సందేశంతో చివరి శ్వాస వరకు సేవా విలువలను ఆచరణలో పెట్టిన ఉదాత్త వ్యక్తిత్వం ఆయనది. పుట్టపర్తిలో అంతర్జాతీయ ధ్యాన కేంద్రాన్ని స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించిన శ్రీ సత్య సాయి బాబా దేశంలోని అనేక రాష్ట్రాలు మరియు విదేశాల్లో ఆశ్రమాలు, సేవా సంస్థలు స్థాపించి ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం, అహింస మార్గాలను ప్రబోధించారు. అలాగే రాయలసీమ ప్రాంతాల్లో శుద్ధి చేసిన తాగునీటి ప్రాజెక్టులను నిర్మించి ప్రజల దాహార్తిని తీర్చడం, ఆధునిక వైద్యం ఉచితంగా అందించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, నాణ్యమైన విద్యను అందించే పాఠశాలలు కాలేజీలను స్థాపించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు ఆయన గొప్పతనానికి నిదర్శనం. మానవులంతా ఒక్కటేనన్న భావంతో పరస్పరం ప్రేమ, సౌభ్రాతృత్వంతో జీవించాలని శ్రీ సత్య సాయి బాబా గారు బోధించిన మార్గాన్ని మనందరం అనుసరించాలన్నారు. ప్రస్తుతం నేను నా కుటుంబ సభ్యులులండన్ లో ఉన్నానన్నారు.ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం లో సావిత్రి దేవి శ్రీహరన్, మదనపల్లి రవి,తిలక్, కుమార్ స్వామి, భక్తులు పాల్గొన్నారు.
Admin
Namitha News