Wednesday, 29 July 2026 08:17:28 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఉజ్వల్ కృష్ణారెడ్డి–తేజస్విని ఆర్యరెడ్డి వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు

Date : 28 June 2026 06:08 PM Views : 63

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉజ్వల్ కృష్ణారెడ్డి–తేజస్విని ఆర్యరెడ్డి వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు , మదనపల్లి: మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు శ్రీమతి ఎన్. అనుషా రెడ్డి, ఎన్. శ్రీనాథ్ రెడ్డి దంపతుల కుమారుడు చిరంజీవి ఎన్. ఉజ్వల్ కృష్ణారెడ్డి, సౌభాగ్యవతి తేజస్విని ఆర్యరెడ్డి వివాహ రిసెప్షన్ మదనపల్లెలోని "ఆర్" కన్వెన్షన్ హాల్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ శాసన సభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్. నిసార్ అహ్మద్, మాజీ పార్లమెంట్ సభ్యుడు రెడ్డెప్ప, రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు తుర్లు ఆనంద యాదవ్, తదితర పార్టీ అగ్రనేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ పరిశీలకురాలిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనుషా రెడ్డి కుటుంబంలో జరిగిన ఈ శుభకార్యానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వి. మనుజా రెడ్డి, పరిశీలకులు జింకా చలపతి, బాబ్జాన్, ఎస్‌ఈసీ సభ్యురాలు షమీమ్ అస్లాం, వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, జడ్‌పీటీసీ సీహెచ్. రామచంద్రారెడ్డి, రాష్ట్ర మైనారిటీ విభాగ కార్యదర్శులు కరీముల్లా, ఎస్‌కే ఇర్ఫాన్, నాయకులు కేశవ రెడ్డి, వెంకట రమణారెడ్డి, బుద్ధారెడ్డి ప్రసాద్ బాబు, శ్రీనివాసులు, ఎన్. ఇర్ఫాన్ ఖాన్, ఈశ్వర్ నాయక్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, శీలం రమేష్, కొత్తపల్లి మహేశ్, బండపల్లి వెంకట రమణ, యూనస్, బయ్యా రెడ్డి, నాగరాజ రెడ్డి, వడిగల శ్రీకాంత్, చరణ్, షేక్ జబి, మజ్జిగ కేశవ యాదవ్, మహేశ్‌ పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :