నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 16 ః మల్లయ్య కొండ మహాశివుని ఆలయ అభివృద్ధి పెద్దిరెడ్డి కుటుంబంతోనే సాధ్యమైందని మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. సోమవారం ఆయన సోదరుడు జోగి రాము వైకాపా నాయకులతో కలిసి మల్లయ్య కొండ మహాశివుని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ఈవో ముని రాజా ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మల్లయ్య కొండ కు రోడ్డు, ఆలయ నిర్మాణం, అభివృద్ధి పనులు చేసిన ఘనత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కృషి ఫలితమేనని నేడు వేలాది మంది భక్తులు కొండకు తరలిరావడం చూస్తుంటే భవిష్యత్తులో మల్లయ్య కొండ ప్రముఖ శైవ క్షేత్రంగా మరియు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది మరో శ్రీశైలం కావడం ఖాయమని చెప్పారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర, నల్లగుండ్ల మల్లికార్జున రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, హేమంత్ కుమార్, వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News