నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 18 : మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28వ తేదీ న మదనపల్లె పర్యటన సందర్భంగా అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లకు వినతిపత్రం సమర్పించిన మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్. మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈనెల 28వ తేదీ మదనపల్లె పర్యటన సందర్భంగా అనుమతులు, హెలిప్యాడ్, భద్రత చర్యలపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి లను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందని మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ తెలిపారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి వినతి మేరకు సీనియర్ నాయకులు ఎన్.అనీషా రెడ్డి, శ్రీనాథ రెడ్డి దంపతుల కుమారుడి వివాహా రిసెప్షన్ కు విచ్చేయుచున్న నేపథ్యంలో హెలిప్యాడ్, రూట్ మ్యాప్, ఏర్పాట్లు తెలియపర్చూతామని వెల్లడించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు ఎన్. శ్రీనాథ రెడ్డి, వలసపల్లి నాగరాజు రెడ్డి, తట్టి శ్రీనివాసులురెడ్డి, రామకృష్ణా రెడ్డి, ఈశ్వర్ నాయక్, ఎన్.ఇర్ఫాన్ ఖాన్, బయ్యారెడ్డి, మల్లికార్జున రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గ్రానైట్ మహేష్, నర్సింహులునాయుడు, సత్యనారాయణ, నాసిర్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News