నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 03 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ కళాశాలకు "ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు " ఉత్తమ ఐ.ఎస్.టి.ఈ ఫాకల్టీ చాప్టర్ అవార్డు-2025 పురస్కారం లభించిందని మిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీ. రామనాథన్ అన్నారు. ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ISTE) వారు పుదుచ్చేరిలో నిర్వహించిన 55వ జాతీయ వార్షిక సదస్సులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్ని ఛాప్టర్లలో అత్యుత్తమ నాయకత్వం మరియు నిర్వహించిన సాంకేతిక, శిక్షణా, సేవా కార్యక్రమాల పరిణామం, సాంకేతిక విద్య లో నాణ్యత ఆధారంగా మిట్స్ ఐ.ఎస్.టి.ఈ ఫాకల్టీ చాప్టర్ కు ఈ అవార్డు ను అందజేసినట్లు ఆయన అన్నారు. మిట్స్ కళాశాల ఐ.ఎస్.టి.ఈ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీ దివ్య కు డాక్టర్ ప్రతాప్ సింగ్ కె. దేశాయ్ ఐ.ఎస్.టి.ఈ అధ్యక్షుడు చేతుల మీదుగా ప్రధానం చేసారని తెలిపారు. విద్యార్థులు వినూత్న ప్రాజెక్టులు, సాంకేతికత మరియు ఆవిష్కరణ రంగంలో అత్యుత్తమ పనితీరును గుర్తించి ఈ అవార్డు ప్రధానం చేసారని ఆయన అన్నారు. తమ ను గుర్తించి ఈ అవార్డు ను అందించిన ఐ.ఎస్.టి.ఈ వారికి మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ లు కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News