Saturday, 18 April 2026 04:09:26 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత

కిషోర్, కొండ్రెడ్డి ఫ్లెక్సీ ల చించివేత - నిందితులను అరెస్టు చేయాలని ధర్నా-ఉద్రిక్తత-స్తంభించిన ట్రాఫిక్

Date : 17 April 2026 08:50 PM Views : 46

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 17 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మద్ది రెడ్డి కొండ్రెడ్డి, టిడిపి నాయకుల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. క్రాస్ రోడ్ లో గురువారం రాత్రి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర టిడిపి కన్వీనర్ మద్దిరెడ్డి కొండ్రెడ్డిల ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. ఈ విషయమై శుక్రవారం రాష్ట్ర టిడిపి కార్యదర్శి కొండ్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కార్యకర్తలతో క్రాస్ రోడ్ లో వాహనాల అడ్డం పెట్టి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం ఫ్లెక్సీల చించివేత తెలుసుకున్న పలు మండలాల నుండి స్వచ్ఛందంగా వాహనాలలో టిడిపి నాయకులు, కార్యకర్తలు కొండ్రెడ్డి స్వగృహం చేరుకొన్నారు. అక్కడి నుండి కొండ్రెడ్డి టిడిపి కార్యకర్తలతో ర్యాలీగా పాత బస్టాండ్ మీదుగా క్రాస్ రోడ్డు చేరుకొని మొలకలచెరువు క్రాస్ రోడ్డుకు అడ్డంగా ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జిందాబాద్, కొండ్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఫ్లెక్సీలుచించిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి నినాదాలతో హోరెత్తించారు. ప్రధాన రహదారిలో ధర్నా జరుగుతుండడంతో ఆర్టీసీ సర్వీసులు, వాహనాలతో పాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కొండ్రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని హక్కు ప్రతి ఒక్కరికి ఉందని మా ఫ్లెక్సీలు చించివేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైనా దమ్ముంటే ధైర్యంగా ఎదుర్కోవాలని ఫ్లెక్సీల మీద ప్రతాపం చూపడం పిరికి బంధ చర్యగా అభివర్ణించారు. ఫ్లెక్సీలు చించిన వారిని అరెస్టు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.ఈ ఆందోళన కార్యక్రమాల్లో నియోజకవర్గం లోని ఆరు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :