Sunday, 13 September 2026 08:00:41 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

వృద్ధురాలైన తన భూమిని కాజేయాలని చూస్తున్న భూస్వామి

30 ఏళ్ల తన జీవనాధారాన్ని దూరం చేయవద్దు అంటున్న ఓ వృద్ధురాలు నరసమ్మ

Date : 09 January 2026 08:01 AM Views : 499

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 09: ఆత్మకూరు మండలంలోని మహిమలూరు గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వృద్ధురాలైన నరసమ్మ గత 30 ఏళ్లుగా తాను సాగుబడి చేసుకుంటున్న భూమిని అడ్డగించిన భూస్వామి నా భూమి ని నాకు కాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరినైనా తనపై దౌర్జన్యానికి దిగుతున్నారని , బెదిరింపులు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతో ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కథనం మేరకు సర్వే నెంబరు 165 /5 లోని నాలుగు ఎకరాల 41 సెంట్లు భూమి లో గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఇందులో రెండు ఎకరాల 30 సెంట్లు తనకు ప్రభుత్వం కేటాయించిందని మిగిలిన రెండు ఎకరాల 11 సెంట్లు శివాయి భూమిని తాను సాగు చేసుకుంటూ వస్తున్నానని తెలిపారు. 20 ఏళ్ల క్రితం తన భర్త మృతి చెందిన ఈ పొలం ఆధారంగానే ఎంతో కష్టపడి, సేద్యం చేసుకొంటూ ఐదుగురు ఆడపిల్లలకు వివాహాలు జరిపించానన్నారు. ప్రస్తుతం తనకు ఈ పొలమే జీవనాధారం , వృద్ధురాలైన నాకు దాపుగా ఎవరూ లేరని భూమి ని కాజేయాలని యత్నింస్తున్నారు. ప్రతి ఏడాది లాగే ఇప్పుడు కూడా పొలం దున్ని వరి నాటేందుకు పొలాన్ని సిద్ధం చేశానన్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ పొలం తనదేనంటూ సాగుబడికి అడ్డగించారన్నారు. వరి నాటుకునేందుకు వీలు లేకుండా అడ్డుకొని దాడి చేసేందుకు ప్రయత్నించారని, బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సాగు చేసుకుంటున్న భూమిని తనకు ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. ఒంటరిగా జీవిస్తున్న తనకు ఇదే జీవనాధారం అని తెలిపారు. తనకు న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య కైనా పాల్పడుతానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమ గ్రామంలో జరిగిన గ్రామసభలో తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తహసిల్దార్ సమస్యను పరిశీలించి తగు చర్యలు చేపడతామని తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :