నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా పీవీ మోహన్ నియామకం - కాంగ్రెస్ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా హర్షం మదనపల్లె : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా కర్ణాటక ఎమ్మెల్సీ పీవీ మోహన్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ అధిష్టానం నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో పీవీ మోహన్ కీలక పాత్ర పోషిస్తారని ఆకాంక్షించారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు,విధానాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆయన నాయకత్వం దోహదపడు తుందని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి నాయకులు,కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పీవీ మోహన్ ముందుకు సాగాలని డాక్టర్ ఎస్.కె.బాషా ఆకాంక్షించారు.కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతో 2029లో అటు దేశంలో,ఇటు ఏపీలో పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పీవీ మోహన్ కి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఎస్.కె బాషా వెల్లడించారు.
Reporter
Namitha News