నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 18 : 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా తంబళ్లపల్లె ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించారు. ఎంపీపీ పాఠశాల తో పాటు ఆదర్శ పాఠశాలలో చిత్రలేఖనం, మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్8 శ్రీనివాసులు, ఆదర్శ రెస్పాండెంట్ విజయ భాస్కర్ రెడ్డి లు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం, వికాసం, క్రీడల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి జిలానిభాష, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News