నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - ఏప్రిల్ 18 : నేటి విద్యార్థులు రేపటి స్వచ్ఛ ఆంధ్ర సమాజ నిర్దేశకులుగా ఎదగాలని డ్వామా పీడీ వెంకటరత్నం విద్యార్థులకు బోధించారు. శనివారం ఉదయం కోటకొండ పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్యా విధానం, మౌలిక సదుపాయాలు పై ఆరా తీశారు. పాఠశాలకు సుమారు 17 లక్షలతో నిర్మించిన ప్రహరీగోడను పరిశీలించి సంతృప్తి చెంది బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలని స్థానిక మాజీ ఎంపీటీసీ చిన్నరెడ్డెప్పకు సూచించారు. అనంతరం విద్యార్థుల తో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఇప్పటినుండే సాధన చేయాలని ప్రోత్సహించారు. అనంతరం విద్యార్థుల చేత స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం విధిగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏపీ డి చందన, టి ఏ సుజాత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News