నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 04 ః నేడు కమ్యూనికేషన్ సిస్టం తో మారుమూల గ్రామాలలో సైతం సెల్ ఫోన్ రాజ్యమేలుతుంటే నేటికి తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఓ పంచాయతీ సెల్ టవర్ లేక అన్ని రకాలుగా ప్రజలు వెనుకబడిన దుస్థితి దాపురించింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, కమ్యూనికేషన్ రోజు రోజుకు ఎల్లలు దాటుతున్నా ముద్దలదొడ్డికి మాత్రం మోక్షం లభించలేదు. ఈ పంచాయతీలో సచివాలయం తోపాటు అన్ని కార్యాలయాలు ఉన్నా సెల్ టవర్ లేకపోవడంతో మండల కేంద్రంతో సత్సంబంధాలు లేక పెన్షన్లు దగ్గర నుండి ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందడం లేదు. ఈ విషయమై ఆదివారం టిడిపి పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, లు జిల్లా ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సైతం నేటికీ సెల్ టవర్ లేకపోవడం పై ఆశ్చర్యం వ్యక్తం చేసి వెంటనే ముద్దల దొడ్డి పంచాయతీలో సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. సెల్ టవర్ సమస్యపై మంత్రి స్పందించిన తీరుపై టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Reporter
Namitha News