Monday, 14 September 2026 10:12:26 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

రాష్ట్ర మంత్రుల పర్యటనలో మదనపల్లెకు ఓరిగింది ఏమి...?

మదనపల్లె జిల్లా, మెడికల్ కాలేజ్, కిడ్నీ మాఫియా... స్పష్టత ఇవ్వని పర్యటన....?

Date : 14 November 2025 08:45 PM Views : 252

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 14 : మదనపల్లి కి రాష్ట్ర మంత్రులు ముగ్గురు వచ్చారు, వెళ్ళారు, మదనపల్లె జిల్లా పై స్పష్టమైన హామీ ఏదీ...!? మదనపల్లె కేంద్రంగా జరిగిన కిడ్ని రాకెట్ పై ఏమి చర్యలు తీసుకున్నారు, హాస్పిటల్ సీజ్ చేస్తారా, ఇంక ఎవరికి, ఏమి, సంబంధాలు వున్నాయనే విషయాలు వెల్లడించక పోవడం దురదృష్టకరం అన్నారు.‌ మాటైన మాట్లాడని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మెడికల్ కాలేజ్ పిపిపి విధానంపై ఏమీ మాట్లడని వైద్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ అంటూ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ విమర్శలు గుప్పించారు. ‌శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కూటమి మంత్రుల మదనపల్లె పర్యటనలో మదనపల్లె అభివృద్ధి విస్మరించారని అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌. రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ మదనపల్లె పట్టణానికి గురువారం కూటమి పార్టీలకు చెందిన ముగ్గురు మంత్రులు వచ్చారు. వారు రావడానికి ముందు మదనపల్లె ప్రజలు ఎంతో ఆత్రుతతో మదనపల్లె పై వరాలజల్లు కురిపిస్తారని ఎదురు చూశారు, వారు వచ్చిన తరువాత ఎందుకు వచ్చారు, ఎమీ ఇచ్చారు అని ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దశాబ్దాల కల అయిన ‌మదనపల్లె జిల్లా ఏర్పాటు పై మంత్రులు స్పష్టమైన ప్రకటన చేసి మదనపల్లె ప్రజలకు మంత్రులు శుభవార్త అందిస్తారని ప్రజలు ఆకాంక్షిస్తే ఊసురుమనిపించడం బాధకరమైన విషయం, మెడికల్ కాలేజ్ పైన వైద్య ఆరోగ్య శాఖమంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటన చేస్తే బాగుండేదని అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి వారి పార్టీకి చెందిన వ్వక్తి ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చారు, ఇక్కడ అభివృద్ధి, సివిల్ సప్లై పైన ఎలాంటి హామీలు ఇవ్వకుండా వెళ్ళడం దురదృష్టకరం అన్నారు. మదనపల్లె పట్టణం అభివృద్ధి, రోడ్ల దుస్థితిపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం మంత్రుల పర్యటనపై ఇక్కడి ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‌వారి పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకమండలి ప్రమాణ స్వీకారం తప్ప ప్రజలకు ఉపయోగపడింది శూన్యం, ప్రజాధనం వృధా పర్యటనగా అభివర్ణించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :