నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ మండలం సిటిఎం గ్రామంలో వెలసిన శ్రీ నల్ల వీర గంగా భవాని అమ్మవారి జాతర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. మదనపల్లెలో కొనసాగుతున్న ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్, మదనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వైయస్ షర్మిలా రెడ్డి పాల్గొని భక్తాదులకు అన్నదాన ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కలిసి నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. అనంతపురం జిల్లాలో పర్యటన ముగించుకుని అన్నమయ్య జిల్లా కాశిరావుపేట వద్ద ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న వైయస్ షర్మిలా రెడ్డి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అదే పేరుతో కొనసాగించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రేపు కూడా అన్నమయ్య జిల్లాలోనే తన పర్యటన కొనసాగుతుందని తెలిపారు.
Reporter
Namitha News