Saturday, 12 September 2026 01:52:29 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

మదనపల్లె జైల్ భరో లో 35 మంది అరెస్ట్

సంయుక్త కిసాన్ మోర్చా, జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడించిన కామ్రేడ్లు

Date : 10 August 2026 03:37 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 10 : సంయుక్త కిసాన్ మోర్చా , కార్మికసంఘాల పిలుపుమేరకు దేశ వ్యాప్త జైల్ భరో కార్యక్రమం లో భాగంగా మదనపల్లె కలెక్టర్ కార్యాలయం వద్ద,, రైతు సంఘాలు,, బికెయంయు,, ఎఐటియుసి, సి ఐ టియు ఆధ్వర్యంలో సోమవారం పికెటింగ్ నిర్వహించారు.. ఈ సందర్బంగా పోలీసులు 35 మంది రైతు సంఘం,, కార్మికసంఘాల, నేతలను అరెస్ట్ చేశారు.. జైల్ భరో కార్యక్రమం లో భాగం తొలుత మిషన్ కాంపౌండ్ నుండి ప్రదర్శన గా కార్మిక,కర్షక సంఘ నేతలు కలెక్టరేట్ వైపు నినాదాలతో వచ్చారు. మోడీ డౌన్ డౌన్,, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నశించాలి,, కార్మికుల కనీస వేతనం 31 వేలు ఇవ్వాలి,, కార్మిక చట్టాలు, నాలుగు కోడ్లుగా కుదించడం దుర్మార్గం ,, రైతుఆదాయం రెట్టింపు చేసే చర్యలు చేపట్టాలని,, వ్యవసాయ కూలీల పని దినాలు 200 కు పెంచి,, రోజుకు 700 అందచేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా పికెటింగ్ చేస్తున్న రైతు సంఘం, రాష్ట్ర నాయకులు,, డా.టి. జనార్దన్,, బికెయంయు, జిల్లా అధ్యక్షులు తోపు. కృష్ణప్ప,, ఎఐటియుసి నాయకులు మనోహర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు హరి శర్మ, అంగన్వాడీ టీచర్స్ కార్యదర్శి గంగాదేవి తోపాటు 35 మంది కార్మిక రైతు సంఘ నేతలను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ గతంలో సాధించిన కార్మిక చట్టాలను రద్దు చేయడం,, కనీస వేతనాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నేడు రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతూ, వారికి కనీస గిట్టుబాటు ధర అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని నీర్వీర్యం చేస్తూ, కార్పొరేట్ లకు ఊడిగం చేయడం,, ఉపాధి కల్పన లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకుల్లో అశాంతి, అలజడికి కారకులతున్నారని పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనం ₹ 31,000, అందజేయాలని, వ్యవసాయ కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని వారు కోరారు.. కార్మిక రైతు సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిహెచ్ పి ఎస్ కార్యదర్శి హరి,, బి కెయంయు నేత మునిరత్నం నాయుడు,,గజపతి,,తిరుమల,,దేవా,, రాధా సియుటియు నాయకులు గంగాదేవి,, మధురవాణి,, జ్యోతి , విజయ తదితరులు పాల్గొన్నారు అనంతరం వన్ టౌన్ పోలీసులు సొంత పూచికత్తు మీద అరెస్టయిన కార్మిక, రైతు నేతలను విడుదల చేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: