Saturday, 12 September 2026 04:30:59 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

వెలిగల్లు ప్రాజెక్టు కుడికాలువకు నీటి విడుదల చేసిన మంత్రి మండిపల్లి

ప్రాజెక్టు నీటిని నమ్ముకుని పంటలు వేయొద్దు.. ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వండి – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Date : 06 September 2026 10:59 AM Views : 153

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గాలివీడు/రాయచోటి - సెప్టెంబర్ 06 : అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు కుడి కాలువకు ఆదివారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 15 రోజుల అనంతరం 80 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల కొనసాగించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రస్తుత నీటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పశువుల అవసరాలు, భూగర్భ జలమట్టం పెంపుదలకే నీటిని ప్రాధాన్యంగా వినియోగిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రతి చెరువును గరిష్టంగా 30 శాతం వరకు మాత్రమే నింపుతారని, కనీస అవసరాలకు మించి నీటిని విడుదల చేయబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు 0.5 టీఎంసీల నీటిని అక్టోబర్ చివరి వరకు వినియోగించేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి తెలిపారు. అనంతరం హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి సుమారు 0.5 టీఎంసీల నీటిని వెలిగల్లు ప్రాజెక్టుకు తిరిగి భర్తీ చేసేలా జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు

పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి* ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున నీటి లభ్యతపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రాజెక్టులోని నీటిని నమ్ముకుని అధిక నీటి అవసరమయ్యే పంటలు సాగు చేయవద్దని, ఆరుతడి పంటలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని రైతులను చేతులెత్తి కోరారు. "ప్రస్తుతం మనం నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం తాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. వెలిగల్లు ప్రాజెక్టు నీటిని నమ్ముకుని పంటలు వేయవద్దు. ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయండి" అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.» ప్రజలకు తాగునీరు, పశువులకు నీరు అందించడమే ప్రస్తుతం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు. నీటి లభ్యతను బట్టి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు

*పంట నష్టంపై ఆందోళన వద్దు* ఇప్పటికే నీటి కొరత కారణంగా ఏవైనా పంటలు ఎండిపోయి నష్టపోయినట్లయితే, వాటికి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా పరిహారం అందేలా జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ కాలువలు, చెరువుల ద్వారా దిగువ ప్రాంతాలకు అవసరమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. కాలువల నిర్వహణ, నీటి ప్రవాహం, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కడప ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ బాలచంద్రారెడ్డి, వెలిగల్లు ప్రాజెక్టు ఈఈ భరత్ కుమార్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: