నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మిట్స్ విద్యార్థినులకు ఎస్బీఐ ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్లు - ఛాన్సలర్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి హర్షం మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు అఖిల ఎడగొట్టు మరియు గైక్వాడ్ జాస్రిత ప్రతిష్టాత్మకమైన ఎస్బీఐ ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026-27కు ఎంపిక కావడం గర్వకారణమని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు.ఈ స్కాలర్షిప్లకు ఎంపికైన ప్రతి విద్యార్థినికి రూ.1,15,000 చొప్పున,మొత్తం రూ.2,30,000 ఆర్థిక సహాయం మంజూరైనట్లు ఆయన వెల్లడించారు.భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) విభాగమైన ఎస్బీఐ ఫౌండేషన్ అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ కార్యక్రమం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను కొనసాగించే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యంగా నిర్వహించబడుతోందని తెలిపారు.గత విద్యార్హతల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ను అందజేస్తున్నారు.స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థినులను మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వ్యవస్థాపకులు అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి,ప్రో-ఛాన్సలర్ ఎన్.ద్వారకానాథ్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల,వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్,సీనియర్ మేనేజర్ (స్టూడెంట్ అఫైర్స్) డాక్టర్ అథాహర్ సమీనా,డీన్-మేనేజ్మెంట్ స్టడీస్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.
Reporter
Namitha News