Saturday, 12 September 2026 01:52:32 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

నకిలీ పత్రాలతో దళితుల భూములు కబ్జాకు యత్నం - ఇన్చార్జి జిల్లా కలెక్టర్,ఎస్పీలకు బాధితుల ఫిర్యాదు

Date : 17 August 2026 05:56 PM Views : 118

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నకిలీ పత్రాలతో దళితుల భూములు కబ్జాకు యత్నం - ఇన్చార్జి జిల్లా కలెక్టర్,ఎస్పీలకు బాధితుల ఫిర్యాదు - ఏపీవైజీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున మద్దతు మదనపల్లె : తరతరాలుగా దళిత కుటుంబానికి వారసత్వంగా వస్తున్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీవైజీపీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున ఆరోపించారు.బాధితులు రాచపల్లి చిన్నప్ప,రాచపల్లి రెడ్డప్ప కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదికలో అన్నమయ్య జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ నారాయణ్ శర్మ,ఎస్పీ ధీరజ్ కునుబిల్లిలకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె మండలం,బండమీదకమ్మపల్లి పరిధిలోని సర్వే నంబర్ 521/1లో ఉన్న 2-78 ఎకరాల భూమి తమ కుటుంబానికి వారసత్వంగా వస్తోందని తెలిపారు. భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు తమ పేర్లపైనే ఉన్నాయని పేర్కొన్నారు.అయితే సిటిఎం క్రాస్ రోడ్డుకు చెందిన ఆర్టీసీ శంకర్ రెడ్డి తప్పుడు పత్రాలు,నకిలీ నోటీసులు సృష్టించి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు.కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.అనంతరం ఆవుల మల్లికార్జున మాట్లాడుతూ భూమి వివాదంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.తప్పుడు పత్రాలు ఉన్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు,బెదిరింపులు,కుల దూషణలపై కూడా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్,ఎస్పీని కోరారు.బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి,రెవెన్యూ అధికారులు భూమిని పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :