నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 16 : అన్నమయ్య జిల్లా నూతన డిసిసి జనరల్ సెక్రెటరీగా గుర్రంకొండ వాసి సయ్యద్ సమీరుద్దీన్ ను నియమిస్తూ జిల్లా డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సమీరుద్దీన్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తన వంతు పూర్తి కృషి చేస్తానని తెలియజేశారు. తనను జనరల్ సెక్రటరీగా నియమించిన డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ గారికి, సహకరించిన పీలేరు నియోజకవర్గం కన్వీనర్ సోమశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చీఫ్ సెక్రటరీ అమీర్ భాషా, డిసిసి వైస్ ప్రెసిడెంట్ ధర్బార్ భాష, డిసిసి జనరల్ సెక్రెటరీ ఖాదర్ ఖాన్, సుండుపల్లి మండల అధ్యక్షుడు సల్మాన్, అర్షద్ అలీ పాల్గొన్నారు.
Reporter
Namitha News