నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 01 : మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వ్యవస్థాపకులు మరియు ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి గారి సతీమణి, మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి నాదెళ్ల లక్ష్మీరాజ్యం గారు ఈరోజు ఉదయం అనారోగ్య కారణాలతో ఆకస్మికంగా మృతిచెందారని యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు . ఆమె మరణ వార్త మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ కుటుంబ సభ్యులను, అధ్యాపకులను, సిబ్బందిని, విద్యార్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విద్యా సంస్థ అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాలు మరియు విద్యార్థుల సంక్షేమం కోసం ఆమె అందించిన సేవలు, సహకారం చిరస్మరణీయమని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. శ్రీమతి నాదెళ్ల లక్ష్మీరాజ్యం గారి అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మదనపల్లె సమీపంలోని ఋషి వ్యాలీ క్రాస్ వద్ద ఉన్న మిట్స్ ఫార్మ్హౌస్లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ప్రతినిధులు, యాజమాన్యం, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు శ్రీమతి నాదెళ్ల లక్ష్మీరాజ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
Reporter
Namitha News