నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జనవరి 08 : పుంగనూరు పట్టణంలోని హౌసింగ్ కార్యాలయంలో పీడీ రమేష్రెడ్డి గురువారం హౌసింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పుంగనూరు, చౌడేపల్లె, సోమల మండలాల హౌసింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన గృహనిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి నిర్మాణాలు సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించేలా చూడాలని ఆయన ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఈ దీనదయాల్రాజు, ఏఈలు, వర్కింగ్ ఇన్స్పెక్టర్లు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News