నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 20 : తంబళ్లపల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ ఘాట్ లో సోమవారం మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో నవ్యాంధ్ర సృష్టికర్త సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు టిడిపి నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా భారీకట్ చేసి పంపిణీ చేసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా పేల్చి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, బీసీ నాయకుడుపురుషోత్తం, హై స్కూల్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు, మహిళా నాయకురాలు సిద్ధమ్మ, తెలుగు యువత నాయకులు నరసింహులు, గంగరాజు, కుక్క రాజు పల్లి టిడిపి అధ్యక్షుడు బాబ్ జాన్, కన్నె మడుగు ఉప సర్పంచ్ సోమశేఖర్, నిజాముద్దీన్, బాలకృష్ణారెడ్డి,రాజంపేట పార్లమెంట్ రైతు సంఘ నాయకుడు వెంకట్ రెడ్డి, మ్యూజికల్ శివ, రామచంద్రారెడ్డి, ఎర్రసానిపల్లి సుధాకర్ , మాజీ తెలుగు యువత అధ్యక్షుడు గురుమూర్తి ,నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Reporter
Namitha News