నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె మండలం,గంగన్నగారిపల్లెలో గల శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసి,నర్సింగ్ కళాశాలలో వార్షిక క్రీడోత్సవాలు - 2026 గురువారం నుండి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహరెడ్డి ముఖ్య అతిధిగా హాజరై క్రికెట్ బ్యాటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు.అదేవిధంగా విజయ భారతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.సేతు టాస్ వేసి ఇందులో టాస్ గెలిచిన జట్టుతో మొదటి మ్యాచ్ ను ప్రారంబించారు.ఈ క్రీడల్లో బాగంగా క్రికెట్,వాలీబాల్,కబడ్డీ,టెన్నికాయిట్,అథ్లెటిక్స్ వంటి వివిధ అటల పోటీలు నిర్వయించ బడునని కాలేజీల కరెస్పాండెంట్ బి.శశి వర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి చల్లపల్లి నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం,శ్రమ,బృందసహకారాన్ని పెంపొందించడమే ఈ క్రీడల ముఖ్య ఉద్దేశ్యన్నారు.డాక్టర్ ఎన్ సేతు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలను క్రీడా స్ఫూర్తితో మాత్రమే ఆడాలన్నారు.ఇందులో జయాపజయాలు గురించి ఎవరు నిరాశపడకూడదు.ఓటమి విజయానికి మార్గం చూపుతుందన్నారు.కాలేజీల కరెస్పాండెంట్ బి.శశి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ క్రీడలు ద్వారా విద్యార్థుల అంతర్గత ప్రతిభలను చాటుకోవడానికి వేదికగా క్రీడలు నిలుస్తాయని అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ అక్మల్ అలీ బేగ్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఇంచార్జ్ ద్వారకనాథ్ రెడ్డి,కాలేజీల గౌరవ డైరెక్టర్,న్యాయ సలహాదారులు డాక్టర్ బి.కృష్ణారెడ్డి,పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ అధినేత డి.చంద్ర మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.
Reporter
Namitha News