నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 17 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలోని అన్నా రెడ్డిపాలెం గ్రామంలో గ్రామ తెలుగుదేశం నేత మెట్టు.విజయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందించిన కోటి 40 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటుచేసిన పలు అభివృద్ధి పనుల ప్రారంభాలు మరియు శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి ఆనం హాజరయ్యారు..గ్రామ తెలుగుదేశం నేత మెట్టు.విజయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. మొదట గ్రామంలోని పురాతన రామాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన గ్రామ హెల్త్ సెంటర్, సిమెంట్ రోడ్లను ప్రారంభోత్సవం నిర్వహించి త్రాగునీటి పథకం,అంతర్గత పైప్ లైన్ల పనులకు శంకుస్థాపన పల్లిపాలెం వినాయక స్వామి ఆలయ పహరి గోడ నిర్మాణం కు భూమి పూజ నిర్వహించారు.. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులకు 481 పాస్ పుస్తకాల పంపిణీ చేశారు అలాగే 12 మందికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందించారు.. పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్త ప్రమాదంలో మృతిచెందగా వారి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు.. ఇలా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి గ్రామాల అభివృద్ధి కోసం తాము నిరంతరం శ్రమిస్తామని మంత్రి ఆనం తెలిపారు
Admin
Namitha News