నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె జిల్లాపై మాట నిలుపుకున్న కూటమి ప్రభుత్వం - శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంబరాలు - పెద్దఎత్తున తరలివచ్చిన కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు మదనపల్లె : ఎన్నో సంవత్సరాలుగా మదనపల్లి జిల్లా కావాలని ఎదురుచూస్తున్న మదనపల్లి నియోజకవర్గ ప్రజల కల సాకారమైన తరుణంలో బుధవారం మదనపల్లి పట్టణం ఎన్టీఆర్ సర్కిల్ నందు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి.కూటమి ప్రభుత్వానికి,ప్రధాని నరేంద్ర మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ బాబులకి ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించార.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి,సీడ్ మల్లికార్జున నాయుడు,యల్లంపల్లి ప్రశాంత్,బండి ఆనంద్,టి.వెంకటరమణారెడ్డి,రాజంపేట ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు గారు,పఠాన్ ఖాదర్ ఖాన్,మహబూబ్ ఖాన్,చీకలబైలు సర్పంచ్ ప్రభాకర,బండి అమర,జనసేన నాయకులు దారం అనిత,శివాలయం డైరెక్టర్లు మల్లికా,పసుపులేటి వరప్రసాద్,జెసి రెడ్డెప్ప,నియోజకవర్గ వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన మదనపల్లి జిల్లాను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు.గత వైసిపి ప్రభుత్వం మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయకుండా ఇక్కడ ప్రజలను మోసం చేసిందన్నారు.అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నదని కొనియాడారు.మదనపల్లి జిల్లా సాధనకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News