Thursday, 30 July 2026 01:42:49 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్

బోయపల్లెలో ఆధునిక పాల కేంద్రం ప్రారంభం

Date : 19 June 2026 10:19 PM Views : 206

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 19 : పాల సేకరణలో మొదటి స్థానంలో దూసుకుపోతున్న శ్రీజ పాలడైరీ శిగలో మరో అధునాతన పాలసేకరణ కేంద్ర మోడల్ కంటైనర్ ప్రారంభించడం హర్షనీయమని శ్రీజ డైరీ ఏరియా మేనేజర్ కృష్ణప్ప కొనియాడారు. శుక్రవారం తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట ఏరియా సిటిఎం సిసి పరిధిలోని బోయపల్లి తో పాటు బి.కొత్తకోట మండలం కుమ్మరపల్లి లలో జైకా మరియు ఎన్.డి.డి.బి సహకారంతో ఏర్పాటు చేసిన మోడల్ కంటైనర్లను క్లస్టర్ మేనేజర్ శేఖర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఏరియా మేనేజర్ మాట్లాడుతూ శ్రీజ సంస్థ ద్వారా పాల ఉత్పత్తి దారులకు అందుతున్న వివిధ సేవలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు సభ్యత్వ ప్రయోజనాల గురించి వివరించారు. క్లస్టర్ మేనేజర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీజ డైరీకి రోజు కు తొమ్మిది లక్షల లీటర్ల పాలు వస్తున్నాయని అందులో తంబళ్లపల్లి నియోజకవర్గం లో 80 వేల లీటర్లు వస్తున్నట్లు చెప్పారు. జులై నెలలో పాడి రైతులకు అందించాల్సిన బోనస్ అలాగే సబ్సిడీ పథకాలు, బయోగ్యాస్ యూనిట్లు, పశువుల కోసం రబ్బరు మ్యాట్లు వినియోగంపై విశదీకరించారు. అతి త్వరలో మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాలమిత్ర సురేష్ పాడి రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఐ సి. కేశవ, శ్రీజ సూపర్వైజర్లు సురేష్, చిట్టిబాబు, బోయపల్లి శ్రీజ వాళ్ళ డైరీ సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: