నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం,జిల్లా ఏఎస్పీ వెంకట్రాద్రి వెల్లడి - స్వాస్థ్య వాక్థాన్ - 2026కి విశేష స్పందన మదనపల్లె : స్థానిక స్వాస్థ్య హాస్పిటల్స్ మరియు ది సత్సంగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురుపూర్ణిమ సందర్భంగా నిర్వహించిన స్వాస్థ్య వాక్థాన్ 2026 కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పద్మ భూషణ్ శ్రీ ఎం,జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ వెంకట్రాద్రి ముఖ్య అతిథులుగా పాల్గొని వాక్థాన్ను జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ప్రతిరోజూ నడక ఎంతో అవసరమని,ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో నడకను భాగంగా చేసుకోవాలని సూచించారు.ఈ వాక్థాన్లో జ్ఞానోదయ హైస్కూల్,విజయ భారతి స్కూల్,జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల,పీపుల్ ట్రీ స్కూల్,ఆరోగ్యమాత స్కూల్,గురుకుల అప్పర్ ప్రైమరీ స్కూల్,నవ చైతన్య భారతి స్కూల్ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు,వైద్యులు,స్వాస్థ్య హాస్పిటల్స్ సిబ్బంది,స్వచ్ఛంద సేవకులు పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.దాదాపు వెయ్యిమంది విద్యార్థులు,ప్రజలు ఈ వాక్థాన్లో పాల్గొని ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే సందేశాన్ని సమాజానికి అందించారు.ఆదేవిధంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడం,నిత్య వ్యాయామం,నడక యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని విద్యాసంస్థలు,అధికారులుపాల్గొన్న ప్రతి ఒక్కరికీ స్వాస్థ్య హాస్పిటల్స్,ది సత్సంగ్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News