నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 25 : తంబళ్లపల్లె మండలంలోని 21 పంచాయతీల్లో గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి వృధాను అరికట్టడానికి సహకరించాలని ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ సూచించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో నీటి సంరక్షణ పై ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో థామస్ రాజా మాట్లాడుతూ రాబోయే వేసవి దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి వృధా చేయరాదని ప్రతి ఒక్కరు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. గ్రామాలలో ఉపాధి హామీలో నీటి సంరక్షణ పనులు వేగవంతం చేయాలని అదేవిధంగా ప్రజలు సైతం అవగాహన పెంచుకొని నీటి సంరక్షణ తమ వంతు బాధ్యతగా వ్యవహరించే లా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్, కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు
Reporter
Namitha News