Sunday, 03 May 2026 09:18:05 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

ఎం.ఎస్.ఎం.ఈ. పార్క్ నిర్మాణానికి రైతులు సహకరించండి - జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ

Date : 24 April 2026 10:32 PM Views : 39

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 ః కుక్కరాజు పల్లి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం జరిగితే పరిశ్రమలతో పాటు యువకులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఉంటాయని ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రైతులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ సూచించారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తోపాటు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తంబళ్లపల్లె మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కుక్క రాజు పల్లి లో ఏపీఐఐసీకి కేటాయించిన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా భూముల కోల్పోతున్న రైతులు దశాబ్దాలుగా ఈ భూమిని నమ్ముకుని జీవిస్తున్నామని ఈ భూమి కోల్పోతే మాకు జీవనాధారం లేదని తమ గోడు వెళ్ళబోసుకున్నారు.తమను అ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ ఎం ఎస్ ఎం ఈ పార్క్ నిర్మాణం తో ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది భవిష్యత్తులో భూముల ధరలు పెరిగి నిరుద్యోగ సమస్య పరిష్కారం జరిగి తంబళ్లపల్లెకు తలమానికంగా నిలుస్తుందని రైతులకు నష్టపరిహారం చెల్లిస్తుందని సహకరించాలని మరోసారి నచ్చచెప్పారు. అనంతరం కోటకొండ సచివాలయం తనిఖీ చేసి సచివాలయ రికార్డులు పరిశీలించి, సిబ్బంది పనితీరు స్థానిక సమస్యల పరిష్కారం పై ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది గ్రామాలలో తాగునీరు, ఉపాధి హామీ, మౌలిక సదుపాయాలపై క్షేత్రస్థాయిలో గుర్తించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం కోటకొండ లో జరుగుతున్న వి బి జి రామ్ జి ఉపాధి హామీ జలధార కార్యక్రమంలో జరుగుతున్న పనులను పరిశీలించి సంతృప్తి చెంది జలదార కార్యక్రమం ద్వారా ప్రతి నీటి బొట్టును వృధా కాకుండా పనులు చేపట్టాలని, ప్రతి కూలికి పని కల్పించాలని సూచించారు. తదుపరి రేణుమాకులపల్లి పంచాయతీలో గతంలో జరిగిన భూరీసర్వేలో జరిగిన తప్పిదాలపై అడిగి తెలుసుకుని నేడు చేపట్టిన భూ సమస్యల పరిష్కారం పై తాసిల్దార్ శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. భూ రిసర్వే లో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు ఆరు మంది ప్రత్యేక కమిటీ తో పూర్తిస్థాయి సర్వే జరుపుతున్నట్లు జాయింట్ కలెక్టర్కు వివరించారు. అనంతరం తంబళ్లపల్లె లో పౌరసరఫరాల గోడౌన్ ను జాయింట్ కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోడౌన్ లోని నిత్యావసర సరుకులు రికార్డులతోపాటు బియ్యం, పప్పులు నిత్యవసర సరుకులను సుమారు అరగంట పాటు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్టోర్ డీలర్లకు సకాలంలో రేషన్ సరుకులు అందుతున్నాయా ఇతర సమస్యలపై జిల్లా ఇన్చార్జి డిఎస్ఓ సుమతి, డిటి నారాయణరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట తాసిల్దార్ శ్రీనివాసులు, ఆర్ ఐ ముద్దుకృష్ణ, సర్వేయర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, స్టోర్ డీలర్లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :