Thursday, 16 April 2026 03:04:22 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మిట్స్ లో ఐమెక్స్ -2కె26 జాతీయ స్థాయి లో సాంకేతిక సింపోజియం

ముఖ్య అతిధిగా హెచ్.సి.ఎల్. గువి బిజినెస్ హెడ్ వినోద్

Date : 05 March 2026 08:31 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 05 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివెర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ) విభాగం వారు ఐమెక్స్ -2కె26 (AIMEX-2K26) జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.వినోద్, బిజినెస్ హెడ్, హెచ్.సి.ఎల్ గువి , బెంగళూరు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో విద్యార్థులు విద్యార్థి దశ నుంచే తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం అత్యవసరం అని, ఈ నైపుణ్యాల ద్వారా వారు భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో మెరుగైన స్థాయికి చేరుకోవచ్చన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేథస్సు, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న అవకాశాలను గమనిస్తే, ఉన్నత విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో అవకాశాలు దక్కే అవకాశం పెరుగుతుంది అని అన్నారు. ప్రస్తుత టెక్నాలజీతో పాటు విద్య, వైద్యం, ఆర్థిక మరియు వ్యవసాయ రంగాలలో నిపుణుల అవశ్యకత పెరిగిన నేపథ్యంలో ప్రాథమిక అవగాహనతో పాటు లోతైన పరిజ్ఞానం కలిగి ఉండడం ఎంతో అవసరం అన్నారు. తన విద్యార్ధి దశలో జరిగిన అనుభవాలను విద్యార్థులతో నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి క్రమశిక్షణతో మెలిగి, ఉన్నత విద్యలను అభ్యసించి భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సింపోజియంలో విస్తృత శ్రేణి సాంకేతిక సెషన్‌లు, పేపర్ ప్రెజెంటేషన్‌లు, ప్రాజెక్ట్ ఎక్స్‌పోలు మరియు పాల్గొనేవారిలో సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను ప్రేరేపించడానికి రూపొందించబడిన ఆకర్షణీయమైన పోటీలను ఈ కార్యక్రమం లో నిర్వహించారు. కార్యక్రమం లో విభాగాధిపతి డాక్టర్ ఎస్ పద్మ , కోర్డినేటర్స్ ఆర్.ఉష, వి.శివరామన్, బి తారకేశ్వర రాజు, శాయీజ్ అహమ్మద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :