Monday, 14 September 2026 08:33:04 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సబ్-రిజిస్ట్రార్ ను బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

రూ .50 లక్షలు, ఇంటి స్థలం డిమాండ్

Date : 28 March 2026 08:46 AM Views : 241

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సబ్-రిజిస్ట్రార్ ను బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్... రూ.50 లక్షలు, ఇంటి స్థలం డిమాండ్.. మదనపల్లి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రభుత్వ అధికారి అయిన సబ్-రిజిస్ట్రార్ ను లక్ష్యంగా చేసుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేయాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మదనపల్లె వన్ టౌన్ పోలీసుల తెలిపిన వివరాల మేరకు, చిత్తూరు జిల్లాకు చెందిన పెన్ పవర్ విలేఖరి బూరగన్ దొర స్వామి (45), మదనపల్లెకు చెందిన మాజీ సబ్ రిజిస్టర్ మోసూరు కోదండరామయ్య (65) కలిసి బాధితుని వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన స్థిరాస్తి వివరాలను సేకరించారు. ఆ వివరాలను ఆధారంగా తీసుకొని ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా నిరంతరం బెదిరింపులకు పాల్పడుతూ బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిసింది. ఇంతటితో ఆగకుండా బాధితుడు మరియు అతని బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లి ఫోటోలు తీసి పంపిస్తూ ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఒక ఇంటి స్థలం ఇవ్వాలని లేకపోతే దానికి సమానంగా రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా మార్చి 26న మదనపల్లి–బెంగుళూరు హైవేపై అభి హోటల్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తమ నేరాన్ని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: