నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - మార్చి 30: అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రివర్యులు బి.సి. జనార్ధన్ రెడ్డి ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మదనపల్లి లో నిర్వహించనున్న 'జీరో పావర్టీ - P4' కార్యక్రమ మొదటి వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు విచ్చేసిన మంత్రి గారిని, రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ లో ఎస్పీ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలోని ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిని మరియు మంత్రి గారి పర్యటనకు సంబంధించి చేపట్టిన భద్రతా ఏర్పాట్లను మంత్రి కి వివరించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
Reporter
Namitha News